ప్రాంతీయ వార్త ప్రతినిధి జూలై 1:
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై BLAలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే *శ్రీ తోట లక్ష్మీకాంతరావు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే *తోట లక్ష్మీకాంతరావు గారు, మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. డీసీసీ అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారు,* మాట్లాడుతూ, SIR కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంపై పలు సూచనలు చేశారు.
సుల్తాన్ నగర్లో SIR సమీక్ష సమావేశం.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ దిశానిర్దేశం*
RELATED ARTICLES
