ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్SIR విజయమే లక్ష్యం.. ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

SIR విజయమే లక్ష్యం.. ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

📰 Generate e-Paper Clip



ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 30:

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే **శ్రీ మదన్ మోహన్ గారు** ఈరోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే *మదన్ మోహన్ గారు* మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో పాటు, SIR ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొన్న ఎమ్మెల్యే గారు, ఒక్క అర్హుడైనా ఓటరు జాబితా నుంచి మిగిలిపోకుండా పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. అవసరమైన చోట ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ SIR ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో SIR కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేయడం, ఓటరు నమోదు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, పార్టీ శ్రేణులు మరియు అధికారుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై ఎమ్మెల్యే గారు సమగ్రంగా సమీక్షించి కీలక సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారు*, TPCC జనరల్ సెక్రటరీ, ఎల్లారెడ్డి నియోజకవర్గ SIR ఇన్‌చార్జ్ *నందిమల్ల యాదయ్య గారు*, BLA మాస్టర్ ట్రైనర్ *నరేష్ రాథోడ్ గారు*, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!