(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 10 )
గాంధారి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ బృందం సందర్శించడం జరిగింది సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ ఆసుపత్రి పరిస్థితులు మొత్తం అస్తవ్యస్తంగా ఉందని అన్నారు లోపల విద్యుత్ లేదు ఫ్యాన్ లేదు బాత్రూం వాసనతో ఉంది చీకటి గదులు ఉన్నాయి చుట్టుపదలు గడ్డి వినాశకరమైన పిచ్చి మొలకలు తీసేటోలే లేరు ఇవన్నీ చూస్తే ప్రభుత్వ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందో ఆలోచించాల్సి వస్తుందని అన్నారు ప్రభుత్వ అధికారులు పాలకులు వెంటనే వీటిపై స్పందించకపోతే ఆందోళన కార్యక్రమం దపాల వారిగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రకాష్ కిషన్ రావు మధు రాములు గణేష్ వివిధ పేషెంట్లు పాల్గొన్నారు
