(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 16)..
ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన పలు అత్యవసర సమస్యల పరిష్కారం కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు** నేడు కామారెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి అధికారిక వినతిపత్రం సమర్పించారు. రైతులు, గిరిజనులు, గ్రామ పంచాయతీలు, తాగునీరు, మౌలిక వసతులు వంటి ప్రజలకు అత్యంత అవసరమైన అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
వినతిపత్రంలో ప్రధానంగా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామం సర్వే నెం. 268, మల్తుమ్మెద గ్రామం సర్వే నెం. 834, 838 భూములకు సంబంధించిన రైతులకు ఇప్పటివరకు పట్టా పాస్ పుస్తకాలు అందలేదని*, పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
అలాగే గండివేట్ తండా, హేమ్లా నాయక్ తండా, వెంకటాపూర్ తండా తో పాటు నియోజకవర్గంలోని పలు గిరిజన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అధికారులు అటవీ భూముల పేరుతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, సంబంధిత భూములపై సమగ్ర పరిశీలన చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు భూములను కేటాయించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో, ముఖ్యంగా మహిళా గ్రామ పంచాయతీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అత్యవసరంగా మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.
వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను మెరుగుపర్చేందుకు ప్రతి మండలంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి గోదాముల నిర్మాణానికి అవకాశం కల్పించాలని అలాగే నాగిరెడ్డిపేట మండలంలో సమీకృత మండల కార్యాలయ సముదాయం నిర్మాణం కోసం 20 ఎకరాల ప్రభుత్వ భూమి మినీ స్టేడియం నిర్మాణం కోసం 5 ఎకరాల భూమిని కేటాయించాలని** కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
వర్షాభావ పరిస్థితుల్లో నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో తాగునీటి నిర్వహణ చేపట్టాలని, అలాగే **బొల్లారం గ్రామంలోని రాము తండా నుండి లింగోజిపల్లి పోచమ్మ ఆలయం వరకు మెటల్ రోడ్డు నిర్మాణానికి పెండింగ్లో ఉన్న అటవీ అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని** ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు జిల్లా కలెక్టర్ను కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమర్పించిన వినతిపత్రంలోని ప్రతి అంశాన్ని జిల్లా కలెక్టర్ సానుకూలంగా పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభించి, కొద్ది రోజుల్లోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే నా. నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించండి వినతి పత్రం
RELATED ARTICLES
