ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 10
మాతుసంగం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా పాలనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో గ్రామ ప్రజల వద్దకే వెళ్లి గ్రామ సభను నిర్వహించినట్లు సర్పంచ్ వందన-బల్వంత్ రావు తెలిపారు. గ్రామాభివృద్ధి, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ప్రత్యేక అధికారి దామోదర్ రెడ్డి (RWS AE) గారు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలు వివిధ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తమ సమస్యలు, సూచనలను వెల్లడించారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు.
ప్రజలవద్దకే వెళ్లి గ్రామ సభ నిర్వహించిన మాతుసంగం గ్రామ సర్పంచ్*
RELATED ARTICLES
