ePaper
Monday, June 29, 2026
ePaper
Homeఎడిటోరియల్గాంధారిలో నూతన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్‌ మోహన్ డీసీసీ అధ్యక్షులు...

గాంధారిలో నూతన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్‌ మోహన్ డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త జూన్ 29

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడం లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్ గారు మరియు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గారు. గాంధారి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు.
రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మదన్‌మోహన్ గారు, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్ గారు. మాట్లాడుతూ, ప్రజల విశ్వాసమే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద బలమని, ప్రజల సంక్షేమం మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే సేవా వేదికగా ఈ నూతన కార్యాలయం నిలవాలని ఆకాంక్షించారు.
డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, ఈ కార్యాలయం కార్యకర్తలకు మార్గదర్శక కేంద్రంగా, ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!