ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 01.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతుకు వ్యవసాయమే నిలిపివేసే పరిస్థితికి తీసుకువస్తున్నారు ట్రాక్టర్క్ తో దుక్కి దున్నుదామన్నా పంట వేద్దామన్న ఈ మడి నుంచి ఇంకో మడిలోకి వెళ్లాలన్నా చేతుకు తగిలేలా విద్యుత్తు తీగలు వేలాడుతూ ఉండడం ప్రాణాలతో అరిచేత పెట్టుకొని వ్యవసాయం చేయాల్సిన దుస్థితి వచ్చింది.
విద్యుత్ తీగల సవరణ కోసం ఎన్నో సంవత్సరాల నుండి అధికారులకు చెబుతున్న పట్టించుకొనే అధికారులు లేరు ప్రాణాలకు లెక్క లేదన్నట్టు విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు పలుమార్లు విజ్ఞప్తి చేసిన పేడచెవిన పెడుతున్న ఈ విద్యుత్ శాఖ అధికారులకు ఎవరో ఒకరి ప్రాణాలు పోయేంతవరకు పట్టించుకునేలా లేరు.
దయచేసి ఇకనైనా ఎలాటి ప్రాణనష్టం జరగకుండా తగు చర్యలు తీసుకొని విద్యుత్ తీగలని సవరించాలని కోరుతున్నాము…
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల
వ్యవసాయం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి
RELATED ARTICLES
