PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 10:19 pm Posted by : PRANTIYA VAARTHA

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి
డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ
ప్రధాన రహదారి పై ధర్నాకు దిగిన ఇరు పార్టీల నాయకులు రైతులు

కామారెడ్డి లింగంపేట్ మే 16 ప్రాంతీయ వార్త

  1. ఎల్లారెడ్డి నియోజకవర్గం కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారి లింగంపల్లి గ్రామం వద్ద పాములవాగు బ్రిడ్జి సుమారు సంవత్సరం కావస్తున్న నిర్మాణం చేపట్టలేక పోవడం మల్లారం చెరువు కట్ట పునరుద్ధరించకపోవడం పోల్కంపేట 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న చౌదరి చెరువు కట్టను పునరుద్ధరించలేకపోవడం పోల్కంపేట కన్నాపూర్ పోతాయిపల్లి గ్రామాల అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వాటిని ఇప్పటికీ పునరుద్ధరించకపోవడం ఇప్పటికీ రైతుల పొలాలలో ఇసుకమేటలు ఎత్తకపోవడం వర్షాకాలం రానున్న కారణంగా చెరువులలో చుక్కనీరు కూడా లేకుండా రైతులకు యాసంగి పంటను పండించడానికి చెరువులలో నీటి చుక్క కూడా కరువైపోయినా సందర్భంగా వెంటనే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు స్పందించి ఈ సమస్యలను తక్షణ పరిష్కారం చేయకుంటే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఈ సమస్యల పరిష్కారం చేయడల ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి