PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 5:31 pm Posted by : RAVINDAR

హైదరాబాదు నుండి తిరుపతి వెళ్లే బస్సుకి అగ్నిప్రమాదం.

కాశం జిల్లా రాజుపాలెం వద్ద హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణికులను తరలిస్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా రాజుపాలెం సమీపంలో బస్సు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును వెంటనే రోడ్డు పక్కన నిలిపివేశారు.

బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంటలు వ్యాపించి పెద్ద ప్రమాదం జరగకముందే, డ్రైవర్ సూచనల మేరకు ప్రయాణికులందరూ బస్సు నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బస్సు ఇంజిన్ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో బస్సు ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రయాణికుల భద్రతపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.