ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20
జహీరాబాద్ పార్లమెంట్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి గారిని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.
నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు తదితర విషయాలపై సీఎం గారికి ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ గారు వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు.