PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 7:28 pm Posted by : RAVINDHAR

విద్యార్థినులకు ఆటో ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్

ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 06

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్  లింగంపల్లి గ్రామం నుండి భూంపల్లి పాఠశాలకు వస్తున్న 15 మంది విద్యార్థులకు వారి సౌకర్యార్థం కొరకు లింగంపల్లి గ్రామస్తుల సహకారంతో ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్ సార్ గారు గ్రామస్తులతో మాట్లాడి వారి సహకారంతో ఆటో మాట్లాడటం జరిగింది ఇలా ఆటో ఏర్పాటు చేయడంతో లింగంపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు ఆటో ఏర్పాటు చేయడంలో లింగంపల్లి గ్రామ సర్పంచ్   లావణ్య రమేష్ ఉప సర్పంచ్ గంగాధర్.  భూంపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్  గ్రామ ఉపసర్పంచ్ రాజయ్య  వార్డ్ మెంబర్లు గ్రామస్తులు ఎంతగానో ప్రోత్సహించారు భూంపల్లి పాఠశాల తరఫున  ప్రధానోపాధ్యాయులు మరియు లింగంపల్లి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు   ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్, ఉపాధ్యాయులు.శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ఉమాదేవి, ముత్తన్న, హైమావతి, మాలతి, చింతల లింగం పాల్గొన్నారు