PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 8:13 pm Posted by : RAVINDHAR

మహిళా సంఘ భవన భూమి పూజ ఎమ్మెల్యే మదన్మోహన్ 33/11 కెవి విద్యుత్ సమస్య వెంటనే పరిష్కరణ

(ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 29)

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ కృషితో గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మహిళ సంఘ భవనానికి 10 లక్షలు మంజూరు చేయగా ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలున్న నా దృష్టికి తీసుకురావాలని మధ్య వర్తులు ఎవ్వరూ అవసరం లేదంటూ అన్నారు స్థానికులు మా గ్రామానికి డ్రైనేజీ సమస్య ఉందని వారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే డి ఈ తో మాట్లాడి సమస్య పరిష్కరించారు అంతేకాకుండా గ్రామంలోని ఇళ్లపై 33 బై 11 కెవి ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే విద్యుత్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి తొందరగా తిమ్మాపూర్ గ్రామంలో ఈ సమస్య ఉండకూడదని అన్నారు దానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు వారి వెంట గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.