ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 02
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి నందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, ప్రొఫెసర్ జయశంకర్ మరియు తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. తదనంతరం జాతీయ జెండా ను ఎగురవేసి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణవేణి, అధ్యాపక బృందం పాల్గొన్నారు