PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 5:14 pm Posted by : RAVINDHAR

మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 02

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి నందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, ప్రొఫెసర్ జయశంకర్ మరియు తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. తదనంతరం జాతీయ జెండా ను ఎగురవేసి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణవేణి, అధ్యాపక బృందం పాల్గొన్నారు