మరోసారి పెరగనున్న పెట్రోల్ ధరలు
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 22 అమెరికా-ఇరాన్ సంఘర్షణల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధరలు 40% పైగా పెరగడంతో, దేశంలో ఇంధన ధరల భారం పడింది. 4 రోజుల వ్యవధిలో మొదట రూ.3, ఆపై తాజాగా 90 పైసల వరకు పెరిగాయి. మే 22న ఢిల్లీలో పెట్రోల్ రూ. 98.64, డీజిల్ రూ. 91.58 కాగా, ముంబైలో పెట్రోల్ రూ. 107.59, డీజిల్ రూ. 94.08కు చేరాయి.త్వరలోనే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.