ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 10
భారతదేశ ప్రధానమంత్రిగా అత్యధిక కాలం ఒక్క రోజు కూడా సెలవు లేకుండా నిరవధికంగా సేవలందించి చరిత్ర సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఎల్లప్పుడూ ఈ విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని,దూరదృష్టి, దృఢసంకల్పం, అభివృద్ధి పట్ల అంకితభావంతో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని ఆయనపై అభిషేక అర్చనలు చేయించామని లింగంపేట బిజెపి మండల అధ్యక్షులు బొల్లారం క్రాంతికుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు
ఈ కార్యక్రమంలో లింగంపేట పట్టణ అధ్యక్షులు నరేష్ భగవాన్, బీజేవైఎం నాయకులు దాసరి అనిల్, సంపత్, మరియు తదితరులు పాల్గొన్నారు.