PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 3:56 pm Posted by : RAVINDHAR

నరేంద్ర మోదీ గారు 4,399 రోజుల నిరంతర సేవ… 12 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం…

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 10

భారతదేశ ప్రధానమంత్రిగా అత్యధిక కాలం ఒక్క రోజు కూడా సెలవు లేకుండా నిరవధికంగా సేవలందించి చరిత్ర సృష్టించిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఎల్లప్పుడూ ఈ విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని,దూరదృష్టి, దృఢసంకల్పం, అభివృద్ధి పట్ల అంకితభావంతో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని  ఆయనపై అభిషేక అర్చనలు చేయించామని లింగంపేట బిజెపి మండల అధ్యక్షులు బొల్లారం క్రాంతికుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు
ఈ కార్యక్రమంలో లింగంపేట పట్టణ అధ్యక్షులు నరేష్ భగవాన్, బీజేవైఎం నాయకులు దాసరి అనిల్, సంపత్, మరియు తదితరులు పాల్గొన్నారు.