ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 06
కామారెడ్డి తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం
ఆధ్వర్యంలో నూతనంగా కామారెడ్డి జిల్లా కేంద్రనికి విచ్చేసి బాధ్యతలు చేపట్టిన సహాయ కార్మిక అధికారి ఏ ఎల్ వో రాజు గారు ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అందులో భాగంగా భవన నిర్మాణ రంగాల కార్మికులు కష్టసుఖాలను వారికి వివరించారు. సహాయ కార్మిక అధికారి ఏ ఎల్ వో రాజు మాట్లాడుతూ కార్మికుల సమస్య ల కోసం నిరంతరం పాటు పడుతమన్నారు. సమస్యలను పరిష్కరిచడం లో నిరంతరం పాటు పడుతనన్నారు. కామారెడ్డి తరహా లో బాన్స్ వాడ అసిస్టెంట్ లేబర్ కార్యాలయంలో అమలు చేయాలని వారిని కోరడం జరిగిందాన్నారు. నకిలీ లేబర్ కార్డులు కాకుండా సాధ్యమైనంత వరకు చూస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా ,జిల్లా ఇన్చార్జి మహామేస్త్రి మర్లు సాయిబాబు, జిల్లా కన్వీనర్ పత్తి బ్రహ్మ రెడ్డి అల్లూరి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.