ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 12
భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం
ఆధ్వర్యంలో బాన్సువాడ సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో నూతనంగా విచ్చేసి ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన కామారెడ్డి సహాయ కార్మిక అధికారి ఏ ఎల్ వో బాన్సువాడ ఇంచార్జ్ రాజు గారు ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అందులో భాగంగా భవన నిర్మాణ రంగాల కార్మికులు కష్టసుఖాలను వారికి వివరించారు. కామారెడ్డి సహాయ కార్మిక అధికారి ఏ ఎల్ వో బాన్సువాడ ఇంచార్జ్ రాజు గారు మాట్లాడుతూ కార్మికుల సమస్య ల కోసం నిరంతరం పాటు పడుతమన్నారు. సమస్యలను పరిష్కరిచడం లో నిరంతరం పాటు పడుతనన్నారు. కామారెడ్డి తరహా లో బాన్స్ వాడ అసిస్టెంట్ లేబర్ కార్యాలయంలో అమలు చేయాలని వారిని కోరడం జరిగిందాన్నారు. నకిలీ లేబర్ కార్డులు కాకుండా సాధ్యమైనంత వరకు చూస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా ఇన్చార్జి BNRK వ్యవస్థాపక అధ్యక్షులు మహామేస్త్రి మర్లు సాయిబాబు మండల కార్మిక నాయకులు ఓలెపు ప్రతాప్ ఆఫీస్ సిబ్బంది దావూద్ తదితరులు పాల్గొన్నారు.