ప్రాంతీయ వార్త జూలై 01
ఎల్లారెడ్డి నియోజకవర్గం కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక ప్రహంగానం దగ్గర నుండి TS BNRKS జిల్లా ఇన్చార్జి మరియు.భవన నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మహామేస్త్రి మర్లు సాయిబాబు మాట్లాడుతూ బాన్సువాడ పరిధిలో అన్ని మండల వ్యాప్తంగా నిజమైన పనిచేసే భవన నిర్మాణ కార్మికులందరికీ
వివిధ సంఘాల మండల కమిటీ ద్వారా లేబర్ కార్డు తీసుకోవాలి అని తెలిపారు అలా చేయడం వల్ల అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కి న్యాయం జరుగుతుంది కార్మికులను విడదీసి నకిలీ లేబర్ కార్డులు నకిలీ బెనిఫిట్ ఇప్పించే మధ్యవర్తుల పైన అధికారులు చట్టపరంగా శిక్షించాలి నకిలీ కార్మికుడై లబ్ధి పొందుతే అధికారులు సర్వే చేసి రికవరీ చేయాలి అన్నారు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీకి లేబర్ అధికారిని నియమించాలి 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి 5000 పింఛన్ ఇవ్వాలి 60 సంవత్సరాలకే కార్డు రద్దు కాకుండా శాశ్వత కాలం కొనసాగించాలి. ప్రతిరోజు సిమెంటు కంకర ఇసుక దుమ్ము ధూళి నిత్యం వీటితో గడుపుతున్నారు కాబట్టి చిన్న వయసులోనే అనారోగ్యం వస్తున్నాయి కాబట్టి. ఈఎస్ఐ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం కొరకు ఈఎస్ఐ కార్డు ను ప్రతి కార్మికునికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సంక్షేమ పథకాలు కార్మికులకు చేరాలంటే వెల్ఫేర్ బోర్డుకి చైర్మన్ ను నియమించాలి అది మా యొక్క కార్మికుడై ఉండాలి మీసేవ ద్వారా చేయబడిన నకిలీ లేబర్ కార్డులను తొలగించాలి అధికారులు ద్వారా సర్వే చేసి అసలైన కార్మికునికి లేబర్ కార్డు అందటట్టు చూడాలి అన్నారు