PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 3:32 am Posted by : RAVINDHAR

తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుల సమావేశం.

ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 15

తెలంగాణ యూనివర్సిటీలో…! మలిదశ ఉద్యమ సమయంలో యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు విద్యార్థి నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకొని, తెలంగాణ యూనివర్సిటీ ఉద్యమకారులుగా, కొన్ని డిమాండ్లు ప్రతిపాదించడం జరిగింది, వాటి సాధించుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్లాలో, తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ఆనాటి జేఏసీ అధ్యక్షులుగా డాక్టర్. పీబీ. సత్యం మాట్లాడుతూ సౌత్ క్యాంపస్ భిక్నూర్ లో ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి పడిందని, జాతీయ రహదారిని నిర్బంధించామని, కామారెడ్డి రైల్వే స్టేషన్ లో రైలు రోకో చేశామని, నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగించామని, కాబట్టి తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో మలిదశ ఉద్యమ సమయంలో చదివిన విద్యార్థులను, విద్యార్థి నాయకులను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అతి త్వరలోనే కామరెడ్డి విద్యార్థి సంఘాలను కలుపుకుని, సౌత్ క్యాంపస్ భిక్నూర్ లో తెలంగాణ మళ్లీ దశ ఉద్యమ సమయంలో యూనివర్సిటీలో చదివిన విద్యార్థులతో విద్యార్థి నాయకుల తో ఒక సమావేశం నిర్వహిస్తామని ఈ సమావేశంలో అవసరమైతే తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ఉద్యమకారుల కమిటీని ప్రకటిస్తామని అన్నారు.