బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో బీఎల్వోలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలి
ఎల్లారెడ్డి,( ప్రాంతీయ వార్త ప్రతినిధి ): ఓటరు జాబితా సవరణలో జరిగే ప్రక్రియలో పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, డిసిసి అధ్యక్షులు ఆలే మల్లికార్జున అన్నారు. స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, మంగళవారం నియోజకవర్గస్థాయి ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, సీనియర్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...