PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 5:29 pm Posted by : RAVINDHAR

గృహిణి అదృశ్యం కేసు నమోదు

గృహిణి అదృశ్యం.. కేసు నమోదు

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20

కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రానికి చెందిన బాయికాడి మమత (28) అనే గృహిణి బుధవారం ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. ఆమె భర్త కిరణ్ కాగా, కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంటినుంచి వెళ్లే సమయంలో మమత వంకాయ రంగు చుడిదార్, ప్యాంటు, చున్నీ ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మమత తల్లి బాయికాడి నరసవ్వ ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీసులు అదృశ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు రాజంపేట ఎస్‌ఐ మొబైల్ నంబర్ 8712686158కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.