కామారెడ్డి ప్రాంతీయ వార్త మే 16
రాజంపేట మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ను శనివారం మండలానికి చెందిన పలువురు సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సత్కరించారు. పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని కోరారు. అలాగే మండల అభివృద్ధికి పోలీసు శాఖ నుంచి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు విక్రాంత్ రెడ్డి, రాజు, సంతోష్ రెడ్డి, నాయకులు షేర్ సింగ్, దేవి సింగ్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.