PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 6:44 pm Posted by : RAVINDHAR

ఎమ్మెల్యే సహకారంతో పట్టణాభివృద్ధి <br><br>మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మత్త మాల భాగ్యవతి <br>

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 31

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ లోనీ ఏడవ వార్డులో ఆదివారం మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో  సిసి రోడ్డు పనులు ప్రారంభించినట్లు మున్సిపాలిటీ ,వైస్ చైర్పర్సన్
మత్త మాల భాగ్యవతి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆశీస్సులతో ఎల్లారెడ్డి పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని తెలిపారు ఎమ్మెల్యే మదన్మోహన్ పట్టణ కేంద్రంలోని సమస్యలను తెలియజేయగానే వెంటనే ఆయన స్పందించి (టి యు ఎఫ్ ఐ డి సి) నుండి నిధులను మంజూరు చేశారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు ఒక్క కోటి 74 లక్షలతో ఏడవ వార్డులో సిసి రోడ్డు ను  ఉత్సాహంగా ప్రారంభించారు అవార్డులోని ప్రజలు మదన్మోహన్  కు జేజేలు పలికారు  కాంగ్రెస్ పార్టీ గురించి నినాదాలు చేశారు ఎమ్మెల్యే అండ దండలతో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో  PACS వైస్ చెర్మెన్ ప్రశాంత్ గౌడ్ కౌన్సిలర్లు గాదె  తిరుపతి, సయ్యద్ గఫర్ , రఫిక్ తమ్మల గాయత్రి శామ్, కో ఆప్షన్ నెంబర్లు పప్పు వెంకటేశం, అరుణ, కాంగ్రెస్ నాయకులు  ప్యాలాల (కొండం గారి) రాములు, తదితరులు పాల్గొన్నారు..