అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ కండువా పిచ్చుకున్న ఉప్పల్వాయి సర్పంచ్
(ప్రాంతీయ వార్త జులై 02 )ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండలం ఉపాల్వాయి గ్రామ సర్పంచ్ శివాని రాజేందర్ ఈరోజు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే గారు వారికీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండగా, ఉపాల్వాయి గ్రామం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ...